అక్కాచెల్లెలు చల్లగా ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందిః సిఎం జగన్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులను విడుదల చేసిన జగన్
అమరావతిః సీఎం జగన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 4వ విడత నిధులు విడుదల చేశారు. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపు ఖాతాల్లో రూ.1358.78 కోట్లు జగన్ జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..అక్కాచెల్లెలు చల్లగా ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందని తెలిపారు.
మహిళల పక్షపాతిగా ముందడుగు వేశామన్నారు. సున్న వడ్డీని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తామన్నారు. 4 సంవత్సరాల్లో 4960 కోట్లు సున్న వడ్డీ అందించామని.. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసి 1402 కోట్లు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టారని వివరించారు. 2016 నుండి సున్న వడ్డీ పథకం రద్దు చేసి మోసం చేయడం నారా వారి చరిత్ర అంటూ సీఎం జగన్ విమర్శలు చేశారు .