ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఈరోజు గురువారం సాయంత్రం ఢిల్లీ కి వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించనున్నారని సమాచారం. అలాగే పోలవరం నిధుల పైన ప్రధానితో చర్చ జరిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలుపుతున్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధాని సమావేశం అనంతరం అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రిలో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారు. రీసెంట్ గా జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖకి వెళ్తున్నామని మంత్రుల వద్ద అన్నట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.