ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం నడుస్తుంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ నమోదైన సంగతి తెలిసిందే. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈవోగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ ను అరెస్ట్ చేయగా..ఈరోజు మరొకరిని అరెస్ట్ చేసారు. ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది ఈడీ. ఢిల్లీలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. విజయ్ నాయర్, సమీర్ మహింద్రు మధ్య లావాదేవీలు నడిచినట్లు అధికారులు గుర్తించారు. మహింద్రు నుంచి విజయ్ నాయర్ ద్వారా.. మనీష్ సిసోడియా సన్నిహితుడు అర్జున్ పాండేకు 4 కోట్లు ముట్టినట్లు సీబీఐ ఆరోపించింది

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ స్కాంపై ఈడీతో పాటు సీబీఐ కూడా మరింత దూకూడు పెంచింది. తెలంగాణకు చెందిన రామచంద్రపిళ్లై కలిసి సమీర్ మహీంద్రు వ్యాపారం చేస్తున్నారు. ఇండోస్పిరిట్ ఛైర్మన్ గా సమీర్ మహీంద్రు పనిచేస్తున్నాడు. రామచంద్రపిళ్లై. సమీర్ హమీంద్రు కలిసి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వసూళ్లు చేసిన డబ్బులను ఢి్లీలోని ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు అభియోగాలు వస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లై ఏ1గా ఉన్నారు. ఇక ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమసాగర్ ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈడీ రామచంద్రన్ పిళ్లై ఇళ్లతో పాటు అభిషేక్,గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. బినామీల ద్వారా లిక్కర్ దందాల్లో పెట్టుబడులు పెట్టారనే అనుమానాలను దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.