డ్వాక్రా మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు జమ సీఎం జగన్
మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసారు సీఎం జగన్. మూడో విడత కింద 78 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా దెందలూరు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నిధులను జమ చేసారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసిందని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని చెప్పారు. మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వమని వివరించారు. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనదని నొక్కి చెప్పారు. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది అన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా..నేను విన్నాను… నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా..ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నానని జగన్ చెప్పుకొచ్చారు.
అంతకు ముందు దెందులూరు కు చేరుకున్న జగన్ కు నేతలు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దజగన్కు స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్సభ సభ్యులు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.