కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసిన భూవివాదం

కామారెడ్డి జిల్లా లింగాయిపల్లి గ్రామంలో భూవివాదం ఉద్రికతకు దారితీసింది. గ్రామంలో భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూవివాదంలో ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసింది. కళ్లలో కారంపొడి చల్లి …కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గత కొద్ది నెలలుగా ఓ భూమి విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది.

ఈ క్రమంలో తోట లింగం కుటుంబానికి చెందిన వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి చేయడంతో పోచయ్య, రాజయ్య, సిద్దవ్వ, లక్ష్మి, అంజయ్య అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రకి తరలించి చికిత్స అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడి చేసిన లింగం కుటుంబ సభ్యులపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.