మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు

టిడిపి ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాల వివరాలు కావాలంటూ నోటీసులు

CID notices to Mangalagiri TDP Head Office

అమరావతిః ఏపీలో టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టిడిపి బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ… అందులో భాగంగానే టిడిపి కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. స్కిల్ నిధులు టిడిపి ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల ద్వారా టిడిపి ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు.