చిత్రసీమ లో మరో విషాదం …
చిత్రసీమలో వరుస విషాదాలు సినీ ప్రముఖులను , అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం యావత్ చిత్రసీమ ను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండగా..మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ కూల్ జయంత్ (44) మరణించారు. కెరీర్ మొదట్లో డాన్సర్గా పలు వేడుకల్లో షో లు చేసిన ఈయన.. అటు తర్వాత ఎంతో కష్టపడి డ్యాన్స్ మాస్టర్గా ఎదిగాడు. ప్రభుదేవా, రాజు సుందరం లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ల దగ్గర డాన్సర్గా పని చేసిన కూల్ జయంత్.. దాదాపు 800 చిత్రాలకు పైగానే డ్యాన్సర్గా పనిచేశారు. ఆ తర్వాత ‘కాదల్ దేశం’ చిత్రంతో కొరియోగ్రాఫర్గా మారారు. ముఖ్యంగా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రఫీ అందించారు.