రిషి సునాక్‌కు విషెష్ తెలిపిన చిరంజీవి

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఎన్నికపై ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు ఇప్పుడు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రిషి సునాక్‌కు విషెష్ తెలిపారు.

‘‘బ్రిటిష్ నుంచి ఇండియా 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న సమయంలో అదే బ్రిటిష్‌కు ఒక భారతీయ సంతతి వ్యక్తి, తొలి హిందువు ప్రధాన మంత్రి అవుతాడని ఎవరు అనుకున్నారు’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అని హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. చిరంజీవితో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘‘భారత్ మాతాకి జై.. మొత్తానికి ఇప్పుడు మాతృదేశం నుంచి ఒక కొత్త వైశ్రాయ్ యూకేకు ప్రధాని మంత్రి అయ్యారు’’ అని అమితాబ్ బచ్చన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.