కీరవాణి కొడుకు చిత్రానికి మెగా సపోర్ట్

మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి..తన కొడుకులు సైతం రాణిస్తున్నారు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా భాగ్ సాలే అనే మూవీ తెరకెక్కింది. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జూలై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్ సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్ యష్ రంగినేని కల్యాణ్ సింగనమల సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్బంగా ఈ సినిమా తాలూకా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ .. భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ మాస్ ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ నేపథ్యం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా.. కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే వరకు నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.

కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. ఇకపైనా కూడా వీరు మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించారు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.