కరోనా పుట్టినిల్లులో ఒమిక్రాన్ అడుగు..

ఒమిక్రాన్ ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్..ఇప్పుడు అన్ని దేశాల్లోకి ప్రవేశించింది. దీని దెబ్బ కు ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ మహమ్మారి కరోనా పుట్టినిల్లులో అడుగుపెట్టింది. కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లయినా చైనాలో ఒమిక్రాన్ వైరస్ కేసు నమోదైంది.

టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే డెల్టా ప్రభావంతో అల్లాడుతున్న చైనాకు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా తోడవడంతో చైనా ప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కాగా, విదేశాల నుంచి టియాంజిన్‌కు డిసెంబర్ 9 వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.