నాల్గు వారాల ముందు నుండే చరణ్ బర్త్ డే సంబరాలు మొదలు

ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…మార్చి 27 న 38 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ తరుణంలో మెగా అభిమానులు ఇప్పటి నుండే మెగా సంబరాలు మొదలుపెట్టారు. చిరుత తో చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్..ఆ తర్వాత మగధీర తో భారీ కమర్షియల్ హిట్ అందుకొని మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుస విజయాలు..ఒకటి , రెండు అపజయాలతో స్టార్ హీరోగా ఎదిగాడు.

గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. ఈ మూవీతో అన్ని భాషల్లో చరణ్ ను కంటూ ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు. చరణ్ స్థాయి మరింత పెరగడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు తోడు పుట్టిన రోజు వస్తుండడం తో నాల్గు వారాల ముందు నుండే బర్త్ డే వేడుకలు మొదలుపెట్టారు. రామ్ చరణ్ చిత్రంతో సరికొత్త సీడీపీ (కామన్ డిస్ ప్లే పిక్చర్)ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. మాస్ మార్చ్ (Mass MaRCH) పేరుతో మార్చి నెల అంతా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు ఈ సీడీపీతో శ్రీకారం చుట్టారు. మార్చి నెలలో చివరి మూడు అక్షరాలు ‘ఆర్ సీహెచ్’ లను రామ్ చరణ్ అనే అర్థం వచ్చేలా పెద్దగా రాశారు. సీడీపీ చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ & యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.