రేపు బెంగళూరు పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు

అరెస్టు సమయంలో అండగా నిలిచిన కన్నడ ప్రజలు

Chandrababu

అమరావతిః ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు రేపు (గురువారం) బెంగళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు టిడిపి ఫోరం సభ్యులతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులతో ఆయన సమావేశం అవుతారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బెంగళూరు టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు సంతమారనళ్లిలోని వైట్‌ఫీల్డ్-హొసకొటె రోడ్డులో ఉన్న కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ ఆహ్వానించింది.