పొలిట్ బ్యూరో సమావేశంలో అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

పట్టభద్రుల ఎన్నకలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం, ఇతర పార్టీల నేతలు సైతం పెద్ద ఎత్తున టీడీపీ లో చేరుతుండడం తో పార్టీ లో సంబరాల వాతావరణం నెలకొంది. మునపటి కంటే జోష్ గా నేతలు , కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కష్టపడాలని అధినేత సూచించారు. ఇదిలా ఉంటె మంగళవారం హైదరాబాద్ టీడీపీ ఆఫీస్ లో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనే మర్చిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందని, మరి సీక్రెట్ ఓటింగ్ వివరాలు ఎలా వెల్లడయ్యాయో సజ్జల చెప్పాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండించారు. వైస్సార్సీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని హితవు పలికారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో జగనే చెప్పాలని నిలదీశారు. అలాగే ప్రస్తుతం 40 మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలిపి మరో ఆసక్తి తెరలేపారు.