చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందిః సిద్ధార్థ లూథ్రా

జైల్లో చంద్రబాబును ఉంచడం ప్రమాదకరమని వ్యాఖ్య

chandrababu-has-life-threat-in-jail-says-advocate-sidharth-luthra

విజయవాడః టిడిపి అధినేత చంద్రబాబు తరపున నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా కాసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన చెప్పారు. జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు.