తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,876..మొత్తం మృతుల సంఖ్య 1,407

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,539 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,876 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,42,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,407 కి చేరింది. ప్రస్తుతం 14,385 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,948 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 72 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/