అల్లు అరవింద్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

ఈనెల 20న ఢిల్లీలో పురస్కారాన్ని అందించనున్న ప్రణబ్ ముఖర్జీ

Allu Arvind
Allu Arvind

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈనెల 20న ఢిల్లీలోని విజ్ఞానభవన్ లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అల్లు అరవింద్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. సమాజ సేవను ప్రోత్సహిస్తూ, సామాజిక అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఈ ఏడాది అల్లు అరవింద్ తో పాటు నలుగురు సీఎంలు, క్రీడాకారులతో పాటు మరికొందరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జస్టిస్ జ్ఞానసుధ, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సభ్యులుగా ఉన్న జ్యూరీ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/