జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం ..

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ లోటు భర్తీ కి కేంద్రం1438 కోట్ల రూపాయల ను విడుదల చేసింది. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలకు గాను కేంద్రం నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రాష్ట్రాలకు గాను 9871 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2021 – 22 ఆర్థిక సంవత్సానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి మొత్తంగా రూ. 8628 . 50 కోట్లు విడుదల చేసింది.

కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సహాయం పై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ కూడా స్పందించారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం మొదటి విడతగా రూ.581.70 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామ పంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్ లకు 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ అయినట్లు చెప్పుకొచ్చారు.