ఏపీలో కొత్తగా 1,439 కరోనా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు

అమరావతి: ఏపీ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62,856 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,439 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 1,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,26,042కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 19,97,454 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,964 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/