ప్రభాస్ మూవీ తాలూకా పిక్ షేర్ చేసిన డైరెక్టర్ మారుతీ

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మారుతీ సినిమా ఒకటి. హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలన లో ఉంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ తాలూకా పిక్ ను మారుతీ సోషల్ మీడియా లో షేర్ చేసాడు.

వింటేజ్ సెట్ ముందు కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. అలాగే ఒక పాత కుట్టు మిషన్ మీద కూర్చుని ఏదో కుడుతున్నట్టుగా నటించారు. తనకు బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ మారుతి సినిమా ఏదో కొత్త ఫ్లేవర్ తో ఉండబోతుందని అంటున్నారు. ఈ ఫోటోలు ఎప్పుడైతే మారుతీ సోషల్ మీడియాలో షేర్ చేసాడో అప్పటి నుండి ఇవి వైరల్ గా మారాయి. లిమిటెడ్ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.