రియాసీ జిల్లాలో 31దాకా బంద్
డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆదేశాలు
Jammu & Kashmir: జమ్ము కాశ్మీర్ రియాసీ జిల్లాలో అత్యవసర సర్వీసులకు చెందిన దుకాణాలు తప్ప మిగిలిన దుకాణాలన్నింటినీ బంద్ ప్రకటించారు.
ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (డిఎం) ఇందు కన్వల్ చిబ్ ఆదేశాలు జారీ చేశారు.
కిరాణా సరకులు, పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, పెట్రోల్ పంపులు, ఎల్పిజి దుకాణాల వంటి అత్యవసర సరకుల దుకాణాలు తప్ప మిగిలిన అన్ని దుకాణాలను ఈ నెల 31 వరకూ మూసివేయాలని డిఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/