ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఆదివారం లాక్డౌన్
వారణాసిలో శని, ఆది రెండు రోజులు అమలు
కరోనా కేసులు పెరిగిపోవటంతో ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లాక్డౌన్ రాష్ట్రమంతటా అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని, మిగిలిన దుకాణాలు, షాపులు, మాల్స్ మూసి సేయాలని పేర్కొన్నారు. పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, వారణాసిలో శని, ఆదివారాలు రెండు రోజులు లాక్డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/