అంబటి రాంబాబు ఫై బుద్ధా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. ముఖ్యముగా టీడీపీ – వైస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నాయి. సభ వేదికపైనే కాదు , సోషల్ మీడియా లోను ఇరు నేతలు విమర్శలు , కౌంటర్ లు వేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న..వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. బుర్ర తక్కువ అంబటీ.. సంజన, సుకన్య తో ఫోన్లు ఆపి శాఖ పై విషయ జ్ఞానం పెంచుకో అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

మొన్నటి వరకు టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు మంత్రి అంబటి రాంబాబును టార్గెట్‌ చేస్తూ.. ట్విట్టర్‌ వేదిక వ్యంగ్యాస్త్రాలు సంధించగా…ఇక ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబుపై బుద్ధా వెంకన్న పోస్టులు పెడుతూ వస్తున్నారు. జగన్ రెడ్డి ధనయజ్ఞం వల్లనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని అదే పోస్ట్ లో బుద్ధా వెంకన్న పెట్టడం జరిగింది. పైసల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ కు వెళుతుంటే కేంద్రం వద్దని మొత్తుకుందని, ప్రాజెక్ట్ దెబ్బతింటుందని హెచ్చరించినా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, తక్కువ రేటుకే ప్రాజెక్టు నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తిచేస్తామని రాతపూర్వకంగా తెలిపిందని వివరించారు.

పోలవరం హెడ్ వర్క్స్ పూర్తి చేసేందుకు రూ.1,771 కోట్లు అవసరమైతే, రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,548 కోట్లకే 24 నెలల్లోనే పనులు పూర్తిచేస్తామని, రూ.223 కోట్ల ప్రజాధనం మిగిలిపోయిందని హడావుడి చేశారని ఆరోపించారు. చివరికి ఇప్పుడు ఆ వ్యయం రూ.1,917 కోట్లకు పెరిగిపోయిందని, అంచనా కంటే రూ.146 కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృథా అయిందని బుద్ధా వెంకన్న విమర్శించారు.