బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అరెస్ట్
ఎట్టకేలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన కేసులో షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత రహీల్కు బదులుగా మరికొరిని డ్రైవర్గా చేర్చి.. రహీల్ దుబాయ్కి పారిపోయాడు.
దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..రహీల్ ఫై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు హైదరాబాద్కు వచ్చిన రహీల్ను ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన అభియోగాలు మోపారు.