మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్కుమార్, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్ లను ప్రకటించిన కేసీఆర్..గురువారం మల్కాజ్గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను ప్రకటించారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.