మరో నలుగురు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత బుధువారం రెండో లిస్ట్ ను ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్రెడ్డిని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్కుమార్, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్ను నిర్ణయించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేశారు.