చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స
చంద్రబాబు ఇవే తనకు ఆఖరు ఎన్నికలు అని ఉంటే తధాస్తు..
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. చంద్రబాబు ఇవే తనకు ఆఖరు ఎన్నికలు అని ఉంటే తధాస్తు అని పేర్కొన్నారు. చంద్రబాబు అదృష్టం బావుండి అన్ని సార్లు సీఎం అయ్యారన్నారు. ఆయన అనుకున్నంత పరిపాలన దక్షుడు కాదని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు సభను కౌరవ సభ అనడంపై బొత్స మాట్లాడుతూ.. ఎవరో వెనక నుంచి అన్న అంశాన్ని రికార్డ్ల్లో లేకపోయినా పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు. ఆయన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/