రేపు జరగబోయే విశాఖ గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది – బొత్స

వికేంద్రీకరణకు మద్దతుగా త‌ల‌పెట్టిన‌ విశాఖ గర్జన ఫైనే అందరి చూపు. రేపు ఏం జరగబోతుందో అని అంత టెన్షన్ పడుతున్నారు. వికేంద్రీకరణకు వైస్సార్సీపీ మద్దతు ప్రకటించడం..మరోపక్క జనసేన అధినేత మూడు రోజుల పాటు విశాఖ టూర్ చేయడం, అమరావతి రైతుల పాదయాత్ర కు టీడీపీ సపోర్ట్ గా ఉండడం తో రేపు ఏంజరుగుతుందో అని యావత్ తెలుగు ప్రజలు ఎదురుచుస్తున్నారు.

ఇదిలా ఉంటె రేపు విశాఖ గ‌ర్జ‌న అంద‌రి క‌ళ్లు తెరిపిస్తుంద‌ని మంత్రి బొత్స అన్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.