బ్రేకింగ్ : సికింద్రాబాద్‌ వెళ్లే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేయడం తో పోలీసులు , రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. వైజాగ్ నుండి వస్తున్న ప్రతి రైల్లో తనికీలు చేస్తున్నారు. కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి తనిఖీ చేస్తున్నారు.

అలాగే చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి పోలీసుల తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్క బోగీని క్షణ్ణంగా తనికీలు చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను ఏది వదిలిపెట్టడం లేదు. పోలీసుల తనిఖీల తో ప్రయాణికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏమిజరిగింది..ఏంజరుగుతుందో వారికీ తెలియడం లేదు.