మైనర్ బాలిక అత్యాచారం కేసు లో తెలంగాణ కోర్టు సంచలన తీర్పు

అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సమీప బంధువు ఒకరు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. బాలికకు అబార్షన్‌ చేసేందుకు కోఠి ఆస్పత్రి నిరాకరించడం తో ఆమె తల్లి హై కోర్టు లో పిటీషన్‌ దాఖలు చేసింది. గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించార పిండం హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని న్యాయమూర్తి స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని హైకోర్టు తెలిపింది. అలాగే, పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, నివేదికను దర్యాప్తు అధికారులకు అందజేయాలని ఆదేశించింది. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బాధిత కుటుంబం తో పాటు.. ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.