విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్

హైదరాబాద్: విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతుకుడు ఫోన్‌కాల్‌ చేశాడు. ఆగంతుకుడి ఫోన్‌కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్​ను నిలిపివేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైలు బోగీల్లో జాగిలాలతో సోదాలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. దీనితో రైళ్లలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/