బీఎండబ్ల్యూ భారత్ సీఈఓ హఠాన్మరణం
గుండెపోటుతో మృతి చెందిన రుద్రతేజ్ సింగ్
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ భారత్ అధ్యక్షుడు, సీఈవో రుద్రదేజ్ సింగ్( 46) గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. యూపీకి చెందిన రుద్రతేజ్ సింగ్ 1996లో సేల్స్ మేనేజర్ గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ అనేక ఉన్నత పదవులను చేపట్టారు. 2019 ఆగస్టు 1న బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్, సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. బీఎండబ్ల్యూలో కంటే ముందు రుద్రదేజ్ సింగ్ రాయల్ ఎన్ ఫీల్డ్ లో పని చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/