చెత్త డబ్బాలో పేలుడు.. వ్యక్తికి గాయాలు

Dust bin blast
Dust bin blast

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. వైట్‌హౌస్ హోటల్ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించడంతో.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చెత్తకుప్పలో ఉన్న పెయింట్ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యె ముఠా గోపాల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పేలుడు ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు . ప్రస్తుతం పేలుడు ఘటనలో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని తెలిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/