బిజెపి 370 సీట్లు గెలుచుకోవడం శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు జెపి పార్టీకి చెందిన ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో ప్రధాని మోడీ మాట్లాడారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఎలా ప్రచారం చేయాలన్న అంశాలను ఆయన తమ పార్టీ వర్గీయులకు దిశానిర్దేశం చేశారు. పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎలా పనిచేసింది, దేశ అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత ర్యాంకింగ్ ఎలా పెరిగిందన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడం తమ పార్టీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అవుతుందన్నారు. ఆర్టికల్ 370ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు మోడీ గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆ ఆర్టికల్ను బిజెపి సర్కారు 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ బూత్లపై దృష్టిపెట్టాలని ప్రధాని మోడీ తమ పార్టీ ఆఫీస్ బేరర్లను కోరారు.