ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) రీసెంట్ గా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శనివారం తరుణ్ ఛుగ్ ఈటల రాజేందర్ ను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సంతాప పత్రాన్ని ఈటల రాజేందర్ కు అందజేశారు. అనివార్య కారణాల వల్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాలేకపోతున్నారని, ఈ క్రమంలోనే తనతో సందేశం పంపించారని తెలిపారు.

గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్ల‌య్య ఆర్‌వీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. కాగా మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ రెండో కుమారుడు. ఇక ఈటెల రాజకీయాల విషయానికి వస్తే…టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన రాజేందర్..బిజెపి పార్టీ లో చేరి , హుజురాబాద్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. రాజేందర్ సతీమణి జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నిక కోసం పనిచేస్తున్నారు.