త్వరలోనే వేల కోట్ల స్కాంలలో మంత్రి కేటీఆర్ ఇరుకుతాడు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

ప్రస్తుతం ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయని.. త్వరలోనే వేల కోట్ల స్కాంలలో మంత్రి కేటీఆర్ ఇరుకుతాడని, తప్పకుండా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. సెప్టెంబర్ 05 న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏమి చేశారని ఇక్కడ పర్యటిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నిస్తూ.. ‘జనతా కో జవాబ్ దో’ అనే నినాదంతో బీజేపీ భారీ సభను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా.. హామీలు అమలు కాలేదని విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3.20 లక్షల ఇల్లు కట్టించారని… ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటున్నారని.. కానీ ఇక్కడ వాడడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జహీరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. పేదలకు ఇచ్చే బియ్యం పంపిణీ విషయంలో కలెక్టర్ ను ప్రశ్నించడం జరిగిందన్నారు. కానీ.. ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. బియ్యానికి కేంద్రం రూ. 30 ఇవ్వడం లేదా ? అని ప్రశ్నించారు.

ఇక నిజామాబాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, బీడీ భవన్ , రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి ..? నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఉచిత ఎరువులు, ఎకరంపల్లి ఎయిర్ పోర్టు, పోడు భూములు, కేజీ టు పీజీ విద్య, తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగ భృతి, ప్రతి మండలానికి నలుగు డాక్టర్లతో పాటు 30 పడకల ఆసుపత్రి, మాధవినగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు కేసీఆర్ ఇచ్చారని..కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అరవింద్ విమర్శించారు.