బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు పోస్టర్ రిలీజ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర ఈనెల ౧౬తో ముగుస్తుంది. ఈ సందర్బంగా కరీంనగర్ లో ఎస్ఆర్ ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు కరీంనగర్ లో ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరీంనగర్ లో నిర్వహించే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.

నాల్గు విడతల్లో బండి సంజయ్ యాత్ర చేపట్టగా..అన్ని చోట్ల సంజయ్ కి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. ఇక ఐదో విడత యాత్ర నవంబర్‌‌ 28న నిర్మల్‌‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అశేష జనవాహిని మధ్య సంజయ్ యాత్ర మొదలుపెట్టారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌ పార్లమెంట్‌‌ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.