టిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి నేత రావుల

శ్రీధర్ రెడ్డిని టిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కెటిఆర్‌

Ravula-Sridhar-Joins-TRS

హైదరాబాద్‌: బిజెపి నేత రావుల శ్రీధర్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈరోజు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శ్రీధర్ రెడ్డిని కెటిఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన వెంట పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ లో చేరిన ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సిఎం కెసిఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందని అన్నారు. తాను గత 11 ఏళ్లుగా బిజెపిలో ఉన్నానని, వివిధ స్థాయిల్లో పనిచేశానని, అయితే రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కెసిఆర్‌, కెటిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

BJP Leader Ravula Sridhar Reddy Join In TRS/manatelangana.news


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/