వైస్ షర్మిల ఫై బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి సెటైర్లు

bjp leader adinarayana reddy satire on sharmila

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..కాంగ్రెస్ పార్టీ లో చేరబోతారనే వార్తలు రాజకీయాల్లో చర్చ గా మారిన సంగతి తెలిసిందే. షర్మిల ..కాంగ్రెస్ లో చేరేది చేరానది ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ..రాజకీయాల్లో మాత్రం ప్రతి రోజు చర్చ కు దారితీస్తుంది. తాజాగా ఈ వార్తలపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టమైన సమాచారం ఉందని , ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు.

‘‘షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని ఔటే. షర్మిల అన్న వదలిన బాణం కాదు.. అన్న వదిలేసిన బాణం. ఆ బాణమే రాబోయే రోజుల్లో ఏపీకి రాబోతోంది” అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ రెడ్డి పోలవరానికి పొగపెట్టి.. అమరావతికి అగ్గిపెట్టారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఏపీకి 35 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం 35 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు.