కిషన్‌రెడ్డిపై కెటిఆర్‌ వ్యాఖ్యలు సరికాదు

కేంద్రం ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి సిద్ధం

Laxman
Laxman

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు చేసిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ నేత కె.లక్ష్మణ్ స్పందస్తూ.. కెటిఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డిపై కెటిఆర్ చేసిన విమర్శలు సరికాదన్నారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత కెటిఆర్‌దే నని విమర్శించారు. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిపై చర్చించేందుకు కెటిఆర్ సిద్ధమా? అని సవాలు విసిరారు. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక తమపై టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. నాడు నిజామాబాద్‌ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోయిందని, అందుకే మేనేజ్‌మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/