రాయలసీమ ప్రజలకు క్షమాపణలు..సోము వీర్రాజు

అమరావతి: కడప జిల్లా ప్రజలు హత్యలు చేస్తారంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దూమారాన్ని రేపాయి. రాజకీయ నాయకులు, ప్రజలు సోముపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. రాయలసీమ రతనాల సీమ’అనే పదం తన హృదయంలో పదిలమన్న సోము.. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

కాగా, రాయలసీమలో ఎయిర్‌పోర్ట్‌.. కడపలో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’అని సోము వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/