బీజేపీ నాల్గొవ జాబితా విడుదల
నామినేషన్ల పర్వం నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో బిజెపి నాల్గొవ జాబితాను విడుదల చేసింది. ప్రకటించిన అభ్యర్థులకు ఫోన్లు చేసి ఆఖరు రోజు కావడంతో ఉదయాన్నే వెళ్లి నామినేషన్లను దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. జనసేనకు 8 స్థానాలు పోగా మిగిలిన 11 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీరిలో 6 సీట్లను గురువారం రాత్రి ప్రకటించగా..నేటి శుక్రవారం ఉదయం మిగతా 5 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు.
గురువారం ప్రకటించిన జాబితా అభ్యర్థులు వీరే..
- మల్కాజిగిరి – రామచంద్రరావు
- కంటోన్మెంట్ – కృష్ణ ప్రసాద్(మాజీ ఐపీఎస్)
- శేరిలింగంపల్లి – రవి కుమార్ యాదవ్
- పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్ కుమార్
- సంగారెడ్డి – పులిమామిడి రాజు
- నాంపల్లి – రాహుల్ చంద్ర
- మేడ్చల్ – విక్రమ్ రెడ్డి