మెహ్నార్ – హాజీపూర్ హైవేపై ఘోర ప్రమాదం : 12 మంది మృతి

మెహ్నార్ – హాజీపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పూజల కోసం వేచిచూస్తున్న గ్రామస్తులపైకి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు మరణించగా , పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి కొంతమంది గ్రామస్థులు పూజలు కోసం అంత గుమ్మిగూడారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోగా, హాస్పిటల్ కు తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ట్రక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రమాద ఘటన పై సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.