దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు

India – corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 406 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో 12 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,586కు చేరింది. ఇక, దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.86 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/