బిగ్ బాస్ 5 : విశ్వ కు మాత్రమే కండలు ఉన్నాయా..? – నటరాజ్ మాస్టర్ ఆగ్రహం

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ రోజు రోజుకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కొత్త కొత్త టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ సభ్యులనే కాదు ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. ఇక ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో వినాయక సంబరాలు అంబరాన్ని తాకినట్లు ప్రోమో లో చూపించారు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో సభ్యులు పాల్గొన్నట్టు వారి మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకొన్నట్టు ప్రోమోలో చూపించారు.

కళ్లకు గంతలు కట్టుకుని సరుకులు రాసి ఉన్న కుండలు పగల కొట్టమని ఆదేశించినట్లున్నాడు. దీంతో సింగర్‌ శ్రీరామచంద్ర.. విశ్వను ఎత్తుకుని ఉట్టికొట్టేందుకు సహాయపడ్డాడు. ఆ టాస్క్ నిర్వహిస్తుండగా ఇంటి సభ్యులందరూ ఈలలు వేసి.. గోల చేసి కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపారు. టాస్క్ అనంతరం యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం జరిగినట్టు కనిపించింది. విశ్వ ఒక్కడే చేయగలుగుతాడా? ‘విశ్వ ఒక్కడికే కండలున్నాయా? ఇంకా నలుగురైదుగురు ఉన్నారు. వారిని నేను లేపుతాను. ఒకరి కాదు.. ఇద్దరిని పెట్టండి నేను లేపుతాను అని నటరాజ్ అనడం కనిపించింది. దాంతో నటరాజ్‌తో యాంకర్ రవి మాట్లాడుతూ.. అడిగిన నేను చెడ్డవాడిని అయ్యానా? నేను అడిగిన కదా అంటూ అన్నారు. దాంతో ఇక చాలు లే అన్నట్టు నటరాజ్ మాస్టర్ సైగ చేశాడు. అయితే ఈ గొడవకు కారణం ఏమిటో పూర్తి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.