బిగ్ బాస్ 5 : హౌస్ లోకి వెళ్లిన 11 మంది కంటెస్టెంట్స్ వీరే…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ఆదివారం (సెప్టెంబర్ 05 )మొదలైంది. మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లో సిరి హనుమంత్ అడుగుపెట్టగా..ఆ తర్వాత వీజే సన్నీ, ఆనీ మాస్టర్, శ్రీ రామచంద్ర , శైలజా ప్రియ, లోబో, లహరి , జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల, ప్రియాంక , షణ్ముఖ్ జస్వంత్, పదకొండో కంటెస్టెంట్ గా హమీద వెళ్లారు.
హౌస్లోకి వెళ్లిన ఐదుగురికి మ్యూజికల్ చైర్ మాదిరి టాస్క్ ఇచ్చాడు నాగ్. దీనికి ‘దండం వేసి దండం పెట్టు’ అని పేరు పెట్టాడు. మ్యూజిగ్ ఆగేలోపు ఎవరి దగ్గర పూలమాల(దండ) ఆగుతుందో వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పాడు. లహరితో ఈ గేమ్ మొదలైంది. దండ వేసి దండం పెట్టుకో గేమ్లో లహరీ షారీ దండ చేతిలో ఉండటంతో బిగ్బాస్ ఆమెను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత రూల్స్ పాటించని, దండ సరిగా వేయని వారిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, సిరి హన్మంతు ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఈ గేమ్లో మిగిలిన వీజే సన్నీని విజేతగా ప్రకటించాడు.