మొగులయ్య ను సత్కరించి చెక్ అందజేసిన పవన్ కళ్యాణ్

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య ను సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో సత్కరించి రెండు లక్షల చెక్ ను అందజేశారు. అద్భుతమైన గానం చేస్తూ రంజింప చేస్తున్న జానపద కళాకారుడు మొగులయ్య తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఆలపించారు.

ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య కనిపించారు. అంతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొగులయ్య పేరు మారుమోగిపోతుంది. ఈయన గురించి ఆరా తీయడం జరుగుతుంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇటు తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాను కూడా పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు.

మొగులయ్య గురించి ఇంకా చెప్పాలంటే..తెలంగాణా ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులను గౌరవించిన ప్రథమ వర్గంలో ఉన్న కళాకారుడు ఆయనే. కిన్నెర వాయిద్యం కోసం ఒక పాఠాన్ని రూపొందించి విద్యార్థులతో చదివిస్తూ.మోగిలయ్యకు గౌరవం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ బేగంపేట వద్ద వేయబడ్డ గోడ చిత్రాల్లో మొగిలయ్య బొమ్మ అద్భుతంగా కనిపిస్తుంది. ఇదీ ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవమే అని చెప్పాలి.