అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి

మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

big-blast-in-achyutapuram-sez

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.