జాగ్రత్త… 2 పాన్కార్టులుంటే ఫైన్ పడుద్ది
న్యూఢిల్లీ: ప్రస్తుతం మీ వద్ద ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయా? అయితే, జాగ్రత్త … లేదంటే రూ.10,000 జరిమానా పడుద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్ను కలిగి ఉండాలని ఆదాయపు పన్ను చట్టం1961 లోని సెక్షన్ 139 ఎ తెలుపుతోంది. దీన్ని అతిక్రమిస్తే ఫైన్ వేయాల్సిందేనని అధికారులు నిర్ణయించారు. కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా ఎక్కువ పాన్కార్డులను ఉన్నవారు వెంటనే వాటిని అధికారులకు సమర్పించి, జరిమానా నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పిస్తోంది. ఎన్ఆర్ఐల ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులుండే అవకాశం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఐటీ వెబ్సైట్కు వెళ్లి సరెండర్ డూప్లికేట్ పాన్గ ఆప్షన్ క్లిక్ చేసి, అడిగిన వివరాలు పొందుపర్చి అదనంగా ఉన్న పాన్ కార్డులను రద్దు చేసుకోవచ్చు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/