దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,39,073

corona virus -india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 20,038‬ మంది వైరస్​ బారినపడగా.. మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,994 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. భారత్​లో గురువారం 18,92,969 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,28,291 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,524 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,53,11,844కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,82,181 మంది మరణించారు. ఒక్కరోజే 5,31,200మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య53,68,03,187కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/