దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,39,073
న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 20,038 మంది వైరస్ బారినపడగా.. మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,994 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. భారత్లో గురువారం 18,92,969 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,28,291 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,524 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,53,11,844కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 63,82,181 మంది మరణించారు. ఒక్కరోజే 5,31,200మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య53,68,03,187కు చేరింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/