16న ఢిల్లీ పీఠం ఎక్కనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 16న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో 70 సీట్లకుగాను 62 సీట్లు సాధించి ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఈరోజు ఉదయం గవర్నర్తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.15 నిమిషాలపాటు చర్చించారు. మరోవైపు ఈరోజు ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై కేజ్రీని శాసనసభాపక్షం నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతారు. ఆ తర్వాత కేజ్రీ తన ముఖ్యమంత్రి పదవికి లాంఛనంగా రాజీనామా చేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/